మోర్తాడ్, బతుకమ్మ: పవిత్రమైన కార్తీక మాసంలో వెలిగించిన దీపకాంతులు ప్రజలందరి జీవితాల్లో, భక్తుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ భక్తులు బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దీపాలు వెలిగించారు. ఆడ పడుచులు తులసి పూజలు చేసి ముత్తయిదుల దీవెనలు పొందారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించి అభిషేకాలు చేయించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.