జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : మాతా శిశు మరణాలను అరికట్టాలని, క్షేత్ర సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు జరిగిన మాతా శిశు మరణాలు నివారించగలిగినవి ఉన్నప్పటికినీ క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన రాహిత్యం వలన సంభవించాయనీ తెలిపారు. ఇకముందు జరిగే మాతా శిశు మరణాలకు సంబంధించిన నివేదికలను ఏ రోజు కారోజు జిల్లా కలెక్టర్ కు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఫీల్డ్ లో ఉండాలని అన్నారు. మాతా శిశు మరణాలు సంభవించకుండా సూపర్వైజర్లు, ఆశ, ఏఎన్ఎం లు, మల్టీ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్ర శేఖర్, డి.సి.హెచ్.ఎస్. డా. విజయ లక్ష్మి, మెడికల్ కాలేజి సూపరింటెండెంట్ డా. ఫరీదా, పి..ఓ.,ఏం.హెచ్.ఎన్. డా. శ్రీఖర్, డిప్యూటీ డేమో ఆర్.వేణుగోపాల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
