29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నాగావళి ఎక్స్ ప్రెస్ రైలు లో గంజాయి పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

సంబల్పూర్ నుంచి నాందేడ్ వెలుతున్న నాగావళి ఎక్స్ ప్రెస్ రైలులో గంజాయి రవాణా అవుతుందన్న సమాచారం మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ఓ స్వప్న ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. శనివారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో నాగావళి ఎక్స్ ప్రెస్ రైలులో సోదాలు నిర్వహించగా మహరాష్ట్రలోని గడిపురకు చెందిన పునం చంధ్ శంకర్ రావు చౌథరి వద్ద 5.35 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆంద్రప్రదేశ్ లోని విశాఖ పట్నం నుంచి రూ.1,33,750  విలువైన ఎండు గంజాయిని కొనుగోలు చేసి మహరాష్ట్రకు తరలిస్తున్నారని గుర్తించామని తెలిపారు. పునంచంద్ శంకర్ రావు చౌధరిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హజరుపరిచినట్లు ఎస్ హెచ్ఓ స్వప్న తెలిపారు. ఈదాడిలలో ఎస్ఐ మల్లేష్, మోహన్ సింగ్, గౌతం, దేవేంధర్, రాజేంధర్ లు పాల్గొన్నారు.

More articles

Latest article