.
. . ఒకరికి గాయాలు
రుద్రూర్, బతుకమ్మ:
బోధన్ డిపోకు చెందిన టి ఎస్ 16 యు సి 3223 ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు వెనుక భాగాన ఉన్న అద్దాన్ని రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి రాయితో పగులగొట్టాడని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తెలిపారు. బాన్సువాడ నుండి బోధన్ వైపుకు వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అక్బర్ నగర్ గ్రామం వద్ద చిన్నపాటి జరిగిన గొడవ కారణంగా, రుద్రూర్ గ్రామంలో జేయన్సీ కాలనీ వద్ద కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు వెనుక భాగాన అద్దాన్ని రాయితో పగలగొట్టడం తో, వెనుక సీటులో కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయం అయిందని ఆర్టీసీ డ్రైవర్,కండక్టర్ తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు