హయత్నగర్, బతుకమ్మ : హైదరాబాద్ – హయత్నగర్ కుంట్లూరులోని రావి నారాయణరెడ్డి నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాలనీ సమీపంలో పేదలు వేసుకున్న గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి ఇప్పటికే 30కిపైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. కొన్ని గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు కూడా పేలాయి. భారీగా మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.
