24 C
Hyderabad
Sunday, August 2, 2026

లారీ – ఓమిని ఢీ..క్యాబిన్ లో ఇరుక్కుని డ్రైవర్ మృతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రై, బతుకమ్మ: నిజామాబాద్ నగర్ శివారులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మల్లారం గండిలో జరిగింది . వడ్ల లోడుతో వెళ్తున్న లారీ మల్లారం అడవి ప్రాంతంలో బీడీల లోడుతో వస్తున్న ఓమినీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కుని వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా, డ్రైవర్ మృతి చెందినట్లు వారు నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు రోడ్డు ప్రమాదంపై రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.

 

More articles

Latest article