లింగంపేట్, బతుకమ్మ :
లింగంపేట మండలం మేంగారం గ్రామ శివారులో గురువారం ఉదయం వడ్ల లారీ చెక్కును ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి వడ్లను తీసుకొని లింగంపేట మీదుగా కామారెడ్డి వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. ఎల్లారెడ్డి నుండి లింగంపేట వైపు వస్తున్న సమయంలో అదుపు తప్పి లారీ రహదారి పక్కనే ఉన్న వేప చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలైనట్లు తెలిపారు.
