కామారెడ్డి, బతుకమ్మ : ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు వ్యక్తి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్లో పెట్రోల్ బంకు వద్ద ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈక్రమంలో ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించగా ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
