తన కారు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్
మోహన్ బాబు ఇంటి వద్ద బైఠాయించిన వైనం
వెబ్ న్యూస్, బతుకమ్మ : మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం మళ్లీ రగిలింది. నటుడు మోహన్ బాబు జల్పల్లిలోని ఫాంహౌస్ వద్ద మంచు మనోజ్ ఆందోళనకు దిగారు. తన కూతురు బర్త్ డే వేడుకలకు రాజస్థాన్కు వెళ్లగా.. తన ఇంట్లోని కారు, వస్తువులను అపహరించారని మనోజ్ ఆరోపించారు. మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదని చెప్పారు. దీంతో జల్పల్లి ఇంటి గేటు వద్ద మనోజ్ బైఠాయించారు. ఇప్పటికే మంచు మనోజ్ తన కారు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మనోజ్ ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మనోజ్ రాకతో మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులను మోహరించారు.
