హైదరాబాద్, బతుకమ్మ : నాలా సమస్య పరిష్కరిస్తానంటూ కాలయాపన చేస్తున్నాడని ఎమ్మెల్యేను నిలదీసి, అడ్డొచ్చిన ఎమ్మెల్యే అనుచరులపై స్థానికులు దాడి చేశారు. హైదరాబాద్ – యాకుత్పుర పరిధిలో నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ను స్థానికులు నిలదీశారు. వానాకాలం వచ్చినా కూడా నాలా పనులు చేయడంలేదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరులపై స్థానికులు దాడి చేశారు.
