. . . 31 వేడుకలకు ప్రభుత్వం ఉత్తర్వులు
హైద్రాబాద్, బతుకమ్మ:
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 31 వేడుకల సంధర్బంగా మద్యం ప్రియులకు శుభవార్త చెప్పింది. మంగళవారం మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 వరకు తెరిచి అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. అదేవిధంగా బార్ లకు రాత్రి 1 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ర్ట ఎక్సైజ్ కమీషనర్ హరీ కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించవద్ధని, అనుమతులు లేకుండా పంక్షన్ హల్ లో లిక్కర్ పార్టీలను నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.