పట్టించుకోని విద్యుత్ అధికారులు
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో లైన్మెన్ జేఎల్ఎం లేక రైతులు తిప్పలు పడుతున్నారు. ట్రాన్స్ఫారం పాడైపోయి ఆరు దినాలు కావస్తున్న లైన్మెన్ జె ఎల్ ఎం లేక పంటకు నీరు లేక బీడు పాడుతున్నాయి. లైన్ ఇన్స్పెక్టర్ ఉన్న ఐదు గ్రామాలకు ఓకే ఇంచార్జ్ ఉన్నాడు. కానీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో తమ రైతులందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మా గ్రామానికి లైన్మెన్,జేఎల్ఎం నియమించాలని సంబంధిత అధికారులను రైతులు కోరుతున్నారు.
