. . . నందిపేట్ పోలీస్ స్టేషన్ అవరణలో బిజేపి దాదాగిరి
. . . బిఆర్ఎస్ నేతలపై బిజేపి నాయకుల దౌర్జన్యం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై ఇటివల కాలంలో సోషల్ మిడియాలో ట్రేండింగ్ అవుతున్న పైడి రాకేష్ రెడ్డి మా నియోజకవర్గంకు రావద్ధు పోస్టుల వివాధం కాస్త పోస్టర్ల రూపంలో ధర్శనమిచ్చాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో బుదవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ లను అతికించారు. విషయం తెలిసిన బిజేపి నాయకులు పోస్టర్ లను తోలిగించారు.
పోస్టర్ లు ప్రతిపక్ష పార్టిల నాయకులు అతికించారని అనుమానంతో నందిపేట పోలీసులు ఇద్ధరిని పోలీస్ స్టేషన్ కు రప్పించారు. అక్కడికి చెరిన ఎమ్మెల్యే బావమరిధి, బిజేపి నాయకులు స్టేషన్ అవరణలో వారిపై దౌర్జన్యానికి దిగారు. పోలీసుల ముందే దాడికి యత్నించారు. బిఆర్ఎస్ నాయకుడి కార్ సిట్లను చించివేశారు. ఐతే బిఆర్ఎస్ నాయకులు విజయ్, రాములు మాత్రం తాము ఎ తప్పు చేయలేదని చెప్పడం గమనార్హం.
