బతుకమ్మ, వెబ్ న్యూస్ : బీజేపీ నుంచి మల్క కొమురయ్య, అంజిరెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, లక్ష్మణ్ హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, విజయశాంతి ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

