వరంగల్, బతుకమ్మ : ఏప్రిల్ 27న నిర్వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు బుధవారం పరిశీలించారు. ఆయన వెంట ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
