నిజామాబాద్, బతుకమ్మ: రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ ను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు హైదరాబాద్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనను నుడా చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో కేశ వేణు షబ్బీర్ కు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. షబ్బీర్ ను కలిసిన వారిలో కొండ పాక రాజేశ్, పార్థసారథి తదితరులున్నారు.
