. . . ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ వేడుకలు
. . . భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు
ఇందల్ వాయి, బతుకమ్మ
ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఇందల్ వాయి గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి పండగ వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో మోక్కులు తీర్చుకున్నారు. స్వామివారి కళ్యాణం వేద పండితుల మంత్రోత్సాహాలతో అంగరంగ వైభవంగా జరిపారు. అనంతరం అన్న సత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, మాజీ డిసిసిబి డైరెక్టర్ కోరాట్పల్లి ఆనంద్, మాజీ సర్పంచ్ దశరథ్, సదర్ పెద్దమనిషి అంజయ్య, తోగరి నర్సయ్యా, బాబులయ్య, ధర్మవ్వ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

