మద్నూర్, బతుకమ్మ:అయోధ్య రామ మందిరం లోని బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవ సందర్భంగా బుధవారం మద్నూర్ మండల కేంద్రంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో శ్రీరాముని ఊరేగింపు ఎడ్ల బండి పై ఘనంగా నిర్వహించారు. హనుమాన్ మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
