. . . విధి నిర్వహణలో బేద భావాలను చూపరాదు
. . . నిజామాబాద్ ఇంచార్జీ పొలిస్ కమీషనర్ సింధూశర్మ
డిచ్ పల్లి, బతుకమ్మ:
పొలిస్ శాఖలో క్షేత్రస్థాయిలో విధుల నిర్వహించే పాత్ర ఎంతో ముఖ్యమైనది. వారి వ్యవహర శైలీ చక్కగా ఉన్నప్పుడే ప్రజలలో పొలిసులంటే గౌరవబావం పెరుగుతుంది. పొలిస్ వ్యవస్థలో పని చేసేవారు పబ్లిక్ సర్వేంట్లు అనే విషయం మరువ వద్ధు అని నిజామాబాద్ ఇంచార్జీ పోలిస్ కమీషనర్ సింధూశర్మ అన్నారు. తెలంగాణ ప్రత్యేక పొలిస్ 7 వ బెటాలియన్ (డిచ్ పల్లి) లో ధీక్షాంత్ పరేడ్ ( పాసీంగ్ అవుట్ పరేడ్) శుక్రవారం గణంగా జరిగింది.
బెటాలియన్ కమాండేంట్ పి సత్యనారాయణ అధ్వర్యంలో జరిగిన 14 వ బ్యాచ్ కు చెందిన 463 మంది ఎస్ సి టిపిసీలకు శిక్షణ పూర్తి చేసుకున్న సంధర్బంగా పాసీంగ్ అవుట్ ఫరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ సంధర్బంగా ముఖ్య అతిథి సిందూశర్మ మాట్లాడుతు… పొలిసులు విధి నిర్వహణలో తర, తమ బేదాలను చూపించవద్ధని అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి చెల్లించు పన్నుల ద్వార మనకు జీత భత్యాలు వస్తాయని విషయం మరువ వద్ధని అన్నారు. అంకితా భావంతో పనిచేసి ప్రజల మన్ననలు పోందలన్నారు.
నలుగురికి ట్రోఫిల బహుకరణ….

9 నెలల శిక్షణ సంధర్బంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్సిటిపిసీలలో బెస్ట్ ఫైరర్ గా జీ. శివ క్రిష్ణ, బెస్ట్ అవుట్ డోర్ అండ్ బెస్ట్ అల్ రౌండర్ గా బి.రవి, బెస్ట్ ఇండోర్ గా నవీన్ కుమార్ రెడ్డి, పరేడ్ కమాండర్ నిరంజన్ రెడ్డిలకు చీప్ గేస్ట్ సింధూశర్మ ట్రోఫీలను బహుకరించారు.