నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎంబీబీఎస్ అర్హత కలిగి ఎంఎల్ఎచ్పీ లుగా ఎంపికైన వారికి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డా.బి.రాజశ్రీ శుక్రవారం నియామక పత్రాలను అందజేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో 13మందిని ఎంపిక చేసి నియామాక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో చందర్, సిబ్బంది పాల్గొన్నారు.
