హైదరాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మైనార్టీ సెల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. శనివారం గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ నాయకులు హనుమంతరావులతో పాటు ఇతర సీనియర్ల సమక్షంలో ఆయన టీపీసీసీ మైనార్టీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మైనార్టీ చైర్మన్ గా నియమితులైన ఇర్ఫాన్ అలీని కాంగ్రెస్ నాయకులు పూలమాలలతో అభినందించి సత్కరించారు.

