మద్నూర్, బతుకమ్మ:మద్నూర్ మండల కేంద్రంలో పతాంజలి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మండల అభివృద్ధి అధికారి రాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. యోగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరంగా ఎంతో ముఖ్యమైనదని అన్నారు. యోగ చేసిన వారికి ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. యోగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పతాంజలి ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు, ఏపీవో పద్మ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
