బతుకమ్మ భిక్కనూరు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల స్పాట్లను అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా భిక్కనూరు మండలంలోని అయా గ్రామాల వద్ద రోడ్డు ప్రమాద వివరాలను భిక్కనూరు సిఐ,ఎస్ఐ లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏ ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ రహదారులపై ప్రమాద స్థలాలను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు సూచిక బోర్డులను ఏర్పాటు చేసే విధంగా ఆ చర్యలు తీసుకుంటున్నామన్నారు.