- కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్
రామారెడ్డి, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను శుక్రవారం క్షేత్రస్థాయిలోపరిశీలించారు. పిల్లర్స్ స్థాయి వరకు నిర్మాణం పూర్తయినందున మిగతా నిర్మాణం కూడా వేగవంతం చేయాలని లబ్ధిదారుకు సూచించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఎక్కడ కూడా ఇసుక. మొరం సమస్య లేకుండా ప్రభుత్వం సూచించిన విధంగా నాణ్యతగా ఇండ్లను నిర్మించుకొని త్వరగా గృహప్రవేశాలు చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను ప్రారంభించడానికి డబ్బులు ఇబ్బందిగా ఉన్న నిరుపేద లబ్ధిదారులకు ఐకెపి ద్వారా ముందస్తు రుణం అందించాలని లబ్ధిదారులు ఐకెపి గ్రూపులో లేకపోతే గ్రూపులో చేర్చి మరీ రుణాలను అందించాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా జరిగేలా ఎంపీడీవోను, పంచాయతీ సెక్రెటరీ నీ ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీరితోపాటు హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి ,డి ఇఇ సుభాష్, ఏఈ సుచిత్ర లను ఇందిరమ్మ ఇళ్లను పర్యవేక్షించి తొందరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
