బతుకమ్మ,ముప్కాల్: ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు కోమటి శెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ సంతోష్ రెడ్డి, డైరెక్టర్లు ప్రసాద్, గంగారెడ్డి, శ్రీనివాస్, సంఘ కార్యదర్శి గంగాధర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
