బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద జాతీయం రహదారి పై బీఆర్ఎస్ నాయకులు శనివారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు రైతు బంధు డబ్బులు ఇవ్వలేమని చెప్పడంతో రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా వ్యవహారం పై నిరసనగావెంటనే రైతుల పట్ల ప్రభుత్వ తీరు మార్చుకుని వెంటనే రైతు బంధు డబ్బులు ఖాతాలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
