నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రోడ్డును ఆక్రమించుకుని ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం చేపడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీఆర్ టి కాలనీ వాసులు అన్నారు. ఈ విషయమై మంగళవారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.

పట్టణంలోని 50వ డివిజన్, గాజులపేట్ లోని టిఆర్ టి కాలనీ లో లక్ష్మీనరసింహ మొబైల్ షాప్ పక్కన గల స్థలంలో ఓ వ్యక్తి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా రోడ్డును ఆక్రమించుకొని ఇల్లు నిర్మిస్తున్నాడని, దాని వల్ల స్థానిక కాలనీవాసులకు, రోడ్డు పై నడిచే పాదచారులకు ఇబ్బందికరంగా మారిందని వారన్నారు. రోడ్డును ఆక్రమించుకుని మరి కడుతున్న ఈ కట్టడంపై తక్షణమే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
