. . . సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి ఫైర్
సిరిసిల్ల. బతుకమ్మ :
బీఆర్ఎస్ పార్టీ పై అంత ప్రేమ ఉంటే అందులోనే చేరమని చెప్పండి అంటూ సిరిసిల్ల జిల్లా ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. శనివారం ప్రధానమంత్రి 12 సంవత్సరాల పాలనను పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ ఆధ్వర్యంలో మన బడి – మన బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా జిల్లా ఎస్పీ కనిపించక పోవడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఎస్పీ ఎందుకు రాలేదని డీఎస్పీ నాగేంద్ర చారిని ప్రశ్నించాడు. నేనేమైనా కార్యకర్తని అనుకుంటున్నాడా.. బీజేపీ అంటే ఆయనకు ఎందుకంత కోపం, కేటీఆర్ అంటే ఇష్టమైతే ఆయన వెంటే తిరగమని చెప్పండి అంటూ డీఎస్పీకి సూచించారు.