. . . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర కోసం వందలాది మంది ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీ కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కనీసం హాస్టల్ విద్యార్థులకు బుక్కెడు బువ్వ పెట్టకుండా ప్రాణాలను బలి కోరుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజ మరణ వార్త విషయం తెలిసిన తర్వాత ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలన మరో పేద బిడ్డ ప్రాణం తీసిందని కన్నతల్లికి కడుపుకోత మిగిల్చిందన్నారు.
