రుద్రూర్, బతుకమ్మ :
ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని రుద్రూర్ ఎస్సై సాయన్న వాహనదారులకు సూచించారు. రుద్రూర్ గ్రామ శివారులో వాహనాల తనిఖీల్లో భాగంగా బుధవారం రుద్రూర్ ఎస్సై సాయన్న వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలు, హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, యువకులు, వాహనదారులు పాల్గొన్నారు.
