నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం మున్సిపల్ కార్పేరేషన్ ఆవరణలో మున్సిపల్ ఉద్యోగులు, సెల్ప్ హెల్ప్ గ్రూప్ మహిళలకు క్యారం బోర్డు, చెస్, కల్చరల్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డీఎం ఆర్ డీ, నగర మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
