రుద్రూర్, బతుకమ్మ న్యూస్ :
రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీలో గల హనుమాన్ మందిరంలో ప్రతిష్టాపించిన శ్రీ క్రాంతి నవయుగ గణనాథుని శోభాయాత్రను సోమవారం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామంలోని ప్రధాన వీధులగుండా భజన, కీర్తనలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామ శివారులోని చెరువులో గణనాథుని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ క్రాంతి నవయుగ గణేష్ మండలి సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

