– నగరంలో ముస్లింల భారీ ఊరేగింపు
– ఎంఐఎం ఆధ్వర్యంలో షర్బత్ పంపిణీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్బంగా నిజామాబాద్ నగరంలో ముస్లిం సోదరులు ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఎంఐఎం ఆధ్వర్యంలో నాయకులు షకీల్ అహ్మద్, మునావర్ ఆధ్వర్యంలో హైమదీ బజార్ లోని ఆ పార్టీ కార్యాలయం వద్ద షర్బత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ – ఉన్ – నబీ ఐక్యమత్యంతో కలిసిమెలిసి జరుపుకుంటామని.. మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నిలబడాలని కోరారు. ఊరేగింపులో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్, సహాబాజ్ హైమద్, కార్పొరేటర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.