బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని బంగారు పల్లి గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. గతంలో ఉన్న శాసనసభ్యులు హన్మంత్ సిందే ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించాలని ఇప్పటివరకు నియోజకవర్గంలో ఒక ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆయన అన్నారు. వచ్చిన డబుల్ డబుల్ బెడ్ రూమ్ బాన్సువాడకు తరలించారని ఆయన అన్నారు. బంగారు పల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతో సిసి రోడ్లను ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కేమ్రాజ్ కలాల్లి సర్పంచ్ రమేష్ దేశాయ్. కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు సతీష్ పటేల్, మనోర్ పటేల్, గంగు నాయక్, కొంచెం వార్ అనిల్ సెట్, మనోహర్ పటేల్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

