బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల లోని వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిబుధవారం ప్రారంభిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ వామన్ రావు తెలిపారు. తహసిల్దార్ అధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం వడ్ల కొనుగోలు అంశం పై సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం బుధవారం నుండి అన్ని వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రరంబించాలని పేర్కొన్నారు. అకాల వర్షాలు కురుస్తునందు వల్ల రైతులకు తాడిపత్రిలు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వేణుగోపాల్ గౌడ్, ఎంపీడీవో కమలాకర్, ఏవో కమల, ఆర్ ఐ శీతల్, ఏపీఎం శిరీష సీఈవో సంతోష్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
