- తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్
నిజామాబాద్, బతుకమ్మ : ఉర్దూ భాషాభివృద్ధికి, ప్రచారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోందని తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు తాహిర్ బిన్ హందాన్ అన్నారు. అల్లమా ఇక్బాల్ వెల్ఫేర్ సొసైటీ, ఖిల్లా నిజామాబాద్ లైబ్రరీ తరుపున ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, జిల్లా గ్రాంథాలయా చైర్మన్ రాజా రెడ్డి అంత రెడ్డి కి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ ఉర్దూ భాషను ప్రోత్సహించేందుకు ఉర్దూ ఉపాధ్యాయుల నియామకం అమలు చేస్తున్నామన్నారు. రాత్రిపూట జాగరణ చేసి పనికిరాని పనులకు దూరంగా ఉండాలని, యువత తమ సామర్థ్యాలన్నింటినీ వినియోగించుకోవాలని సూచించారు. ఉన్నత విద్య ద్వారానే దేశ, జాతి అభివృద్ధి సాధ్యమన్నారు. ఉన్నత విద్యపై సీరియస్గా ఉండనంత వరకు ఆర్థిక సమస్యలు వస్తాయని, అభివృద్ధి సాధ్యం కాదన్నారు. జిల్లా గ్రాంథాలయా సంస్థ చైర్మన్ రాజా రెడ్డి అంతా రెడ్డి మాట్లాడుతూ ఉర్దూ పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ ఉమర్, ఉర్దూ జర్నలిస్ట్ ముఖిత్ ఫారూఖీ, సఫ్దర్ హుస్సేన్, అజీమ్ మాలిక్, రహీమ్ షాకీర్, డాక్టర్ సమీ అమన్, సొసైటీ సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.