మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలో రాబోవు గణేష్ ఉత్సవాలు అందరు ప్రశాంతంగా జరుపుకోవాలని మోర్తాడ్ ఎస్సై రాము అన్నారు. మండల కేంద్రంలో పీస్ కమిటీ సమావేశము శుక్రవారం నిర్వహించారు. అందరు గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంనందు జరుపుకోవాలని, ఇతరులకు ఎటువంటి ఇబ్బందులు కలుగ జేయకూడదని, శబ్ద కాలుష్యం చేయకూడదని గణేష్ మండపాల దగ్గర సరియగు జాగ్రత్తలు తీసుకోవాలి పేర్కొన్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ ఎమ్మార్వో చెలుక కృష్ణ, మోర్తాడు ఏఈ రమేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
