నిజామాబాద్, బతుకమ్మ : రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం లో మాధవ్ అనే యువకుడు గల్లంతైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్నానం కోసం నదిలో దిగిన యువకుడు గల్లంతయ్యాడు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు యువకుని కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. యువకుని వివరాలు తెలియాల్సి ఉంది.