నిజామాబాద్, బతుకమ్మ: నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రిటైర్డ్ సీనియర్ వైద్యాధికారి డాక్టర్ వెంకట్ రెడ్డి ఉచిత హోమియో వైద్య శిబిరం ప్రారంభించారు. ఈవైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్స లు నిర్వహించి ఉచితంగా హోమియో మందులు అందజేశారు. యోగా ప్రాధాన్యతను కాలనీవాసులకు వివరించారు. డాక్టర్ స్పందన, డాక్టర్ శివాని, డాక్టర్ పవన్, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆయుష్ విభాగం జిల్లా ఇన్ చార్జి డాక్టర్ గంగాదాస్, పురుషోత్తం, సిద్ధిరాములు, దండి వెంకటి తదితరులు పాల్గొన్నారు.
