రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామంలో సోమవారం పశువులకు ఉచిత గాలికుంటూ నివారణ టీకాలు వేసినట్లు పశు వైద్యాధికారి డా. సురేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 98 ఆవులు, గేదెలకు ఉచిత గాలికుంటు టీకాలు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
