రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మాజీ డిసిసిబి చైర్మన్, యువ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ పోచారం భాస్కర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారం, నాయకులు పత్తి రాము, నెరుగంటి బాలరాజు, తోట సంగయ్య, అక్కపల్లి నాగేందర్, పత్తి లక్ష్మణ్, పట్టెపు రాములు, తోట్ల గంగారం, ఇమ్రాన్, సయ్యద్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
