హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. 16 మంది విద్యార్థులకు అస్వస్థత కు గురయ్యారు. హైదరాబాద్ – బాగ్ లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో రాత్రి భోజనం చేసిన అనంతరం 16 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో అవస్థ పడుతున్న విద్యార్థులను కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి పాఠశాల సిబ్బంది తరలించారు.