భిక్కనూరు, బతుకమ్మ : ఆగి ఉన్న టిప్పర్ ను బస్సు ఢీ కొన్న ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి దగ్గర శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి వైపు వెళ్తున్న ఎం ఎస్ ఎన్ కంపెనీకి సంబంధించిన బస్సు ఆగి ఉన్న టిప్పర్ ను ఢీకొనడంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఎన్ హెచ్ ఏఐ కి సంబంధించిన అంబులెన్స్ లో గాయపడ్డవారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.