బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఐదుగురికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. అతిగా మద్యం తాగి వాహనం నడిపిస్తున్న సంగెం గ్రామానికి చెందిన కాంబ్లి గంగా దీపక్, రెంజల్ బేస్ కు చెందిన కర్రోల్ల సాయిలుకు ఒక రోజు, రాకాసి పేట్ లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఇద్దరికి, అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై పండ్ల బండితో రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం కలిగించిన ఒకరికి ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
