- రిస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన ఎస్ డి ఆర్ ఎఫ్ టీమ్లను అభినందించిన డీజీ
కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి పర్యటించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 40 సెంటీమీటర్ల వర్షంతో కుంభవృష్టి కొరియడంతో పలు కాలనీలు రెండు రోజులుగా జలదిగ్బంధంలో మునిగిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో ఎస్ డి ఆర్ ఎఫ్ టీంలు రిస్కీ ఆపరేషన్లు చేసి పలువురిని కాపాడిన విషయం తెలిసింది. నగరంలోని హౌసింగ్ బోర్డ్, కౌండిన్య కాలనీ, జి ఆర్ కాలనీ, సారంపల్లి రోడ్లలో జరిగిన రిస్క్యూ ఆపరేషన్ ప్రాంతాలను పర్యటించి బాధితులను నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను ప్రాణాలను కాపాడి తెగువ ప్రదర్శించిన సిబ్బందిని డీజీ అభినందించారు.
