. . . బాధితురాలికి హై కోర్టు నోటిసులు జారీ
హైదరాబాద్, బతుకమ్మ :
పోక్సో కేసులో రిమాండ్ ఖైదిగా ఉన్న బండి భగీరథ్ తనకు బెయిల్ మంజూరు చేయాలని హై కోర్టును అభ్యర్తించారు. తనపై నమోదైన పోక్సో కేసు తప్పుడు కేసని పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని హై కోర్టు కు సమర్పించిన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. బుధవారం భగీరథ్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై భాధితురాలి వాదన వినాల్సి ఉన్నందువలన కౌంటర్ దాఖలు చేయాలని బాధితురాలికి న్యాయస్థానం నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 3 కు వాయిదా వేసింది.
