శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

0 15,527
  • ఎస్సై సాయన్న

 

రుద్రూర్, బతుకమ్మ : గణేష్ ఉత్సవాలను, ఈద్ మిలాద్ -ఉన్ – నబీ పండుగలను శాంతియుత వాతావరణంలో  జరుపుకోవాలని రుద్రూర్ ఎస్సై సాయన్న అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ముస్లిం మైనార్టీ నాయకులతో శాంతి  సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రార్థన మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మరియం మజీద్ సదర్ ఇమ్రాన్ ఖాద్రి, మోమినన్ మజీద్ సదర్ ఆరిఫ్ కొరషి, అక్బర్ నగర్ మజీద్ సదర్ షేక్ మొహమ్మద్,మీజ్రా ఫారం మజీద్  సదర్ షేక్ ఫహీం, మహమ్మద్ యునుస్, లాల్ మొహమ్మద్, సయ్యద్ ముల్తానీ, షేక్ నిసార్, షేక్ అన్వర్,మొహమ్మద్ ఫుర్ఖన్ ఖాద్రి, షేక్ మహబూబ్, షేక్ సల్మాన్, షేక్ జమీర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.