29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

తహశీల్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

Must read

📰 Generate e-Paper Clip

  • వారసత్వ పట్టా చేయడం లేదని ఆవేదన

బతుకమ్మ, మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన రైతు తనకు వారసత్వ పట్టా చేయడం లేదని తహశీల్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. మంత్రి భగవాన్ అనే రైతు తనకు వారస త్వంగా సంక్రమించిన భూమిని తన పేరిట పట్టా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి మంత్రి మొగులయ్య పేరుపైన ఉన్న సర్వే నంబర్ 856/68 ఒక ఎకరం భూమిని తన పేరుపైన చేయడం లేదని రామారెడ్డి తహసిల్దార్ అధికారులు చేస్తలేరని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. స్థానికులు అతన్ని రక్షించారు. అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.

More articles

Latest article