బిచ్కుంద, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో ఫేక్ కరెన్సీ పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కామారెడ్డి జిల్లా ఎస్సీ సిందూశర్మ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా బిచ్కంద సర్కిల్ పరిధిలో సుమారు రూ.29లక్షల నకిలీ నోట్లను పట్టకున్నారు. సంబంధిత కరెన్సీని వాటిని కలిగి ఉన్నవారిని కామారెడ్డి జిల్లా కేంద్రానికి తరలించినట్లు తెలిసింది. ఈ విషయంలో బిచ్కుంద సీఐ జగడం నరేష్ ను వివరణ కోరగా టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ కరెన్సీ పట్టకున్న విషయం లో స్పష్టత లేదని, తమకు సమాచారంలేదని అన్నారు.
