29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించండి

Must read

📰 Generate e-Paper Clip

కేంద్ర మంత్రి ప్లహాద్ జోషిని కోరిన సీఎం రేవంత్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  సీఎం రేవంత్ రెడ్డి డిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను కలుస్తూ బిజీబీజీగా ఉన్నారు. ఈక్రమంలో మంగళవారం కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన 2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ. 1,468.94 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి వారు విన్నవించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.  అలాగే సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని కోరారు.

More articles

Latest article